సంతనూతలపాడు: గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు తెలపండి: సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు
సంతనూతలపాడు మండల పరిధిలోని గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలపాలని సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు సోమవారం సూచించారు. వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెలవులకు ఊర్లకు వెళ్లేటప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. అదేవిధంగా దొంగతనాల నివారణకు, దుండగులను, కొత్త వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు