కొండపి: టంగుటూరులో అరుంధతి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహణ
టంగుటూరు బొమ్మల సెంటర్లో శనివారం జగ్జీవన్ రామ్ జయంతిని అరుంధతి నగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నత కోసం జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు. ఉప ప్రధానిగా దేశ అభివృద్ధికి అనేక సూచనలు, చట్టాలను అమలు చేశారన్నారు.