కనిగిరి: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి నూతన ఆర్డీవో అజయ్ కుమార్
కనిగిరి నూతన ఆర్డిఓ గా నియమితులైన అజయ్ కుమార్ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ఆర్డీవో అజయ్ కుమార్ కు సూచించారు. అదేవిధంగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.