రాప్తాడు: శారదా నగర్ శివకోటి శ్రీ పీఠంలో అధిక జ్యేష్ట మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతం మహాలక్ష్మి పాదాలకు పూజలు నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ వద్ద శనివారం సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల వరకు శివకోటి శ్రీ పీఠంలో అధిక జేష్ఠ మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం అప్పు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు అరవింద్ ప్రధాన పూజారి అప్పు స్వామి మాట్లాడుతూ అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాకుడు అరవింద్ స్వామి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.