కనిగిరి: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు మధుబాబు, సమీర్ లు మాట్లాడుతూ... ఆర్టీసీ పరిరక్షణ, ఎలక్ట్రానిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా పిఆర్సి కమిషన్ ను నియమించాలని, పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. 4 వేల కొత్త ఆర్టీసీ బస్సులను , పదివేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.