ఉరవకొండ: జన సంద్రంగా మారిన పీర్ల చావడిలు జలధికి తరలిన పీర్ల స్వాములు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు జరిగిన మొహరం ముగింపు కార్యక్రమాల్లో భాగంగా పీర్ల చావడిలు జన సంద్రంగా మారాయి. మండలంలోని బెలుగుప్ప శ్రీరంగాపురం ఆవులన్న ఎర్రగుడి కాలువపల్లి జీడిపల్లి దుద్దే కుంట గ్రామాల్లో జలది కార్యక్రమాలతో మొహరం వేడుకలు ముగిసాయి. బెలుగుప్పలోని వన్నూరు స్వామి పీర్ల చావడి వద్ద వేలాదిగా జనం తరలివచ్చి పీర్ల స్వాములను దర్శించుకున్నారు. అనంతరం అగ్ని గుండాన్ని పూచివేసి ముజావర్లు ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్త జన సందోహం మధ్య పీర్ల స్వాములు జలధికి తరలి వెళ్లారు.