కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా గుడిపూడి సందీప్ గురువారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... కనిగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మహిళలు, చిన్నారులను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు