కనిగిరి: మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ పై ఆందోళన చెందవద్దు: కనిగిరిలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
కనిగిరి పట్టణంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఒంగోలు బస్టాండ్ వద్ద గల పెట్రోల్ బంకును ఆమె తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు పెట్రోల్ బంకుల వద్ద రెవెన్యూ, పోలీస్ అధికారులతో పరిస్థితిని అంచనా వేయిస్తున్నామన్నారు. ప్యానిక్ సిట్యువేషన్ లేదని, ఆందోళన చెంది, అవసరానికి మించి ఎవరు కూడా పెట్రోల్, డీజిల్ అదనంగా కొట్టించుకోవద్దని సూచించారు.