రాప్తాడు: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఆదివారం 11:30 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్ల లోపల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపల చిన్నారులకు పోలియో రాకుండా అరికట్టేందుకు పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఐదేళ్ల లోపల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం వల్ల పోలియో వ్యాధి రాకుండా అరికట్టవచ్చని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.