కనిగిరి: మండలంలోని యడవల్లి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి ఆలయ పునః ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం
కనిగిరి మండలంలోని యడవల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం వైభవంగా నిర్వహించారు. యడవల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఆలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.