కనిగిరి: పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను ప్రారంభించిన కనిగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహ రెడ్డి, సురేష్
పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ మొక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... మోపాడు రిజర్వాయర్ కెనాల్ ను ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. సీఎం చంద్రబాబు జల ధార-జల హారతి కార్యక్రమాన్ని వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అన్నారు. అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. మోపాడు రిజర్వాయర్ ద్వారా నీటిని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విడుదల చేయాలన్నారు.