కొండపి: కొండేపి మండల కేంద్రంలో రంజాన్ వేడుకలలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండేపి మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు సోమవారం పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఈద్గా వద్దకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి వారిని ఆలింగణం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.