కొండపి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా జరుగుమల్లి మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుమల్లిలోని నర్సింగోలులో నిరసన
పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా జరుగుమల్లి మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుమల్లి మండలంలోని నర్సింగోలులో క్రైస్తవులు, పాస్టర్లు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోని నిజా నిజాలు తేల్చాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.