కనిగిరి: ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులతో భర్తీ చేయాలి: కనిగిరి నియోజకవర్గ బీసీవై పార్టీ నాయకుడు నజీర్ భాష
కనిగిరి: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కనిగిరి నియోజకవర్గం బీసీవై పార్టీ నాయకుడు షేక్ నజీర్ భాష మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గం తో పాటు మార్కాపురం జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాల్లో విద్యాహక్కు చట్టం తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని, పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు కేటాయించి భర్తీ చేసేలా చూడాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు