సంతనూతలపాడు: గుమ్మలంపాడు పాముల కాలనీలో డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ సెర్చ్
సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు పాముల కాలనీలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణంగా శోదాలను చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు కాలనీవాసులతో మాట్లాడుతూ ... గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.