సంతనూతలపాడు: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం: బెల్లంపల్లి లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి
మద్దిపాడు మండలం బెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పొగాకు ధరలు, మార్కెట్ స్థితిగతులపై శివ ప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. పొగాకు రైతులకు తక్షణం గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నాగార్జున, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ పాల్గొన్నారు.