ఉరవకొండ: పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దోమలు కీటకాల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారి
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సోమవారం ప్రిన్సిపాల్ జ్ఞాన ప్రసన్న సమక్షంలో విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా తరగతి గదులకు నివాసముండే రెసిడెన్షియల్ గదులకు వంటగదులు, మరుగుదొడ్లు,స్నానపు గదులకు దోమల నివారణ కొరకై జిల్లా అధికారులు ఆదేశాల మేరకు క్రిమిసంహారకమందును మలేరియా వర్కర్ల చేత కొట్టించడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. విద్యాలయంలో 546 మంది విద్యార్థులు కలిగిన ఈ గురుకుల పాఠశాలలో వారికి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.