కనిగిరి: పట్టణంలో బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: ఇటీవల మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు శుక్రవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ 5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షలు చొప్పున బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు.