ఉరవకొండ: విధినిర్వహణలో అందరి మన్ననలు పొందిందని ట్రెజరీ అటెండర్ సన్మానసభలో పేర్కొన్న ఏటీవో సరస్వతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం కళ్యాణం దుర్గం సబ్ ట్రెజరీ ఆఫీస్ అటెండర్ అనసూయమ్మ పదవీ విరమణ సన్మాన సభలో తన విధుల పట్ల అంకితభావంతో మెలగి అందరి మన్ననలు పొందిందని కళ్యాణదుర్గం సహాయ ఖజానా అధికారిణి సరస్వతి పేర్కొన్నారు. సన్మాన సభను శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఉప ఖజానా అధికారి శ్రీనివాసులు,గుంతకల్ ఉపఖజానా అధికారిణి షబానా, సీనియర్ అకౌంటెంట్ అబీభాలు, స్థానిక వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సన్మాన గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొని దుశ్యాలువాలు పూల మాలలతో సన్మానించి విధుల పట్ల కొనియాడారు.