ఉరవకొండ: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులకు తెలియజేశారు. ఎంపీపీ పెద్దన్న అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయా శాఖల ప్రగతి నివేదికలను సభలో చదివి వినిపించారు. అనంతరం సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రధాన శాఖల అధికారులు గైర్హాజరవడం పట్ల చర్యలు చేపట్టాలన్నారు.