తాడిపత్రి: బడికి వెళ్లకపోతే వాతలు పెడతానని చిన్నారులతో ముచ్చటించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రిలోని హనుమాన్ కాలనీ, పుట్లూరు, ఎల్లనూరు రోడ్లలో బుధవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ ఇంటి వద్ద స్కూలు డ్రెస్ వేసుకొని చిన్నారి ఉండగా వెళ్లి మాట్లాడించారు. ఎందుకు బడికి వెళ్లలేదని ప్రశ్నించారు. బడికి వెళ్లకపోతే వాతలు పెడతానని తమాషాగా ముచ్చటించారు. బాగా చదువుకోవాలని చిన్నారికి సూచించారు.