కనిగిరి: పామూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మదన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి ,సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీగిరి రాజు నరసింహ బాబు ఆధ్వర్యంలో పండితులు బ్రహ్మోత్సవాలను శాస్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో నరసింహబాబు మాట్లాడుతూ... తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.