ఉరవకొండ: వెంకటాద్రి పల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని వెంకటాద్రి పల్లిలో ఉపాధి హామీ పథకం కూలీలకు పి హెచ్ సీ వైద్యాధికారిని ప్రియాంక ఆధ్వర్యంలో సోమవారం వడదెబ్బ పై అవగాహన కల్పించడం జరిగినది. ముఖ్యంగా వడదెబ్బపై అవగాహన పై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ 65 సంవత్సరములు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, ఎండలో తిరగకుండా జాగ్రత్త పాటించాలని వివరించడం జరిగినది.ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రము 4 లోపల ఎండలో తిరగరాదు అని. తెలియజేయడం జరిగినది. ఒకవేళ ఎండలో వెళ్లవలసి వస్తే తలపై టోపీ లేక టవాలు, కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్ళవలెను. తరచూ నీరు త్రాగవలెను.