ఉరవకొండ: మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై శిక్షణా కార్యక్రమం
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు గురువారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పంచాయతీ కార్యదర్శులకు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సంబంధించి రిసోర్స్ పర్సన్ ద్వారా శిక్షణలో పాల్గొన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కృష్ణా నాయక్, పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.