కనిగిరి: హనుమంతునిపాడు మండలంలో రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీని త్వరగా పూర్తి చేసుకోవాలి: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అంకయ్య
వెలిగండ్ల లోని తహసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగండ్ల మండలంలో ఇంకా 1098 రేషన్ కార్డులకు ఈ కేవైసీ ని పూర్తి చేసుకోని లబ్ధిదారులు ఉన్నారన్నారు. వారంతా త్వరగా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. వెలిగండ్ల మండలంలో రేషన్ పంపిణీలలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా రేషన్ సరఫరా చేసినా చర్యలు తప్పమన్నారు.