కనిగిరి: వెలిగండ్ల మండలంలోని మొగుళ్ళూరు లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసిన ఎస్ఐ కృష్ణ పావని
వెలిగండ్ల:: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి 9 మందిని అరెస్టు చేసిన సంఘటన వెలిగండ్ల మండలం మొగుళ్ళూరు లో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మొగులూరులో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణ పావని సిబ్బందితో కలిసి తాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.10,560 లు నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.