ఉరవకొండ: ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన గొరవ నాగభూషణ కుమారుడు గొరవ మధు (25) తలకు తాడుతో గొంతు బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు మృతుడు జి. మధు,బీటెక్ చదివి రెండు సంవత్సరాలు కావడంతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం రానందున జీవితం పై విరక్తి చెంది క్షణికావేశo లో తలకుప్లాస్టిక్ కవర్ చుట్టూ కొని గొంతుకు తాడు బిగించుకొని శుక్రవారం ఉదయం ఇంటిలో ఎవరు లేని సమయంలో మృతి చెందాడు. మృతుడు తండ్రి నాగభూషణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వన్నూరు స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.