కొండపి: పొన్నలూరులోని సంగమేశ్వర ప్రాజెక్టుకు బడ్జెట్లో 25 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజల,రైతులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించినా 10శాతం కూడా పూర్తి కాలేదు. మంత్రి స్వామి చొరవతో రూ.165 కోట్ల అంచనాతో ఈ ఏడాది బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే 10వేల ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు మంచినీరు అందనుంది