రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను వాల్ పోస్టులను విద్యార్థి సంఘం నేతలు ఆవిష్కరించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద గురువారం 11 గంటల 45 నిమిషాల సమయంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమామహేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ మాట్లాడుతూ జూలై 1 నుంచి 4 వరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగిందని ఈ సదస్సులో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ ఉమా మహేష్ తదితరులు పేర్కొన్నారు.