రాప్తాడు: కనగానపల్లి దాదులూరు గ్రామంలో వి బి జి రామ్ జి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఒకటిన్నర గంటల సమయంలో విబిజి రామ్ జి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ బి జి రామ్ జి పథకం పేరు మార్పు చేసి 125 రోజులు పని దినాలతో పాటు రోజుకు 312 రూపాయలు కూలీ రేటును కూడా పెంచడం జరిగిందని భవిష్యత్తులో గ్రామీణ ఉపాధి హామీ పథకం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.