ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో "ప్రజా దర్బార్" కార్యక్రమం
అనంతపురం జిల్లా కేంద్రంలోనిరామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని ఉరవకొండ శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ నిర్వహించారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో వివిధ రకాల ప్రజా సమస్యలపై వివిధ గ్రామాల ప్రజలు, నాయకుల నుంచి వినతి పత్రాలను మంత్రి పయ్యావుల కేశవ్ స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.