అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఓ వృద్ధురాలిపై దొంగ దాడి కలకలం రేపిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామంలో చోరీకి యత్నించిన దొంగను వృద్ధురాలు పసిగట్టడంతో దొంగ బండరాయితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన లో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతుంది.