రాప్తాడు: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కక్కలపల్లి టిడిపిలో విజయోత్సవ సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో కక్కలపల్లి వద్ద అనంతపురం జిల్లా టిడిపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కొనసాగుతున్నాయని గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదని కేవలం అరాచకాలు మాత్రమే చేయడం జరిగిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.