కనిగిరి: పట్టణంలో పెట్రోల్ ,డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
కనిగిరి పట్టణంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ.... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. పెరిగిన ధరల్లో కేవలం ప్రభుత్వం 59 శాతం విధించిన పన్ను అధికంగా ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.