కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలి: కనిగిరిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహమతుల్లా
కనిగిరి పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయులతో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాజా రహంతుల్లా ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం కృషి చేయాలి అన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక ఉపాధ్యాయ సంస్థ యుటిఎఫ్ మాత్రమేనన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో యుటిఎఫ్ సభ్యత్వాలను పూర్తిచేయాలని యుటిఎఫ్ సంస్థలోని ఉపాధ్యాయులకు సూచించారు.