కనిగిరి: మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి వండి ఆదాయం లెక్కింపు, రూ.19.02 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి
చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి ఆలయంలో స్వామివారి హుండీలను సోమవారం దేవాదాయ శాఖ కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ GA సత్యనారాయణ, ఆలయ ఈవో నరసింహా బాబు ఆధ్వర్యంలో సిబ్బంది లెక్కించారు. రెండు నెలల 29 రోజుల హుండీల ఆదాయాన్ని అధికారులు సిబ్బంది సాయంతో లెక్కింపు చేపట్టారు. స్వామి వారి ప్రధాన హుండీ ద్వారా రూ.17,30,395 లు, అన్నదానం ఉండి ద్వారా రూ.1,71,958 లు ఆదాయం వచ్చిందని, మొత్తం ఆదాయం రూ.19,02, 353 లు వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహబాబు తెలిపారు.