రాప్తాడు: అనంతపురంలో వైయస్సార్ పార్టీ బిసి గళం వాల్ పోస్టులను ఆవిష్కరించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీసీ గళం పోస్టర్లను బీసీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గళం కార్యక్రమాన్ని నిర్వహించి బీసీలకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి ప్రజలకు తెలుపబోతున్నామని ఈ సమావేశంలో వైసిపి నాయకులు బిసి నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.