ఉరవకొండ: వరుసగా 8వ రోజు నిలిచిపోయిన సత్యసాయి తాగునీటి పథకం నీటి సరఫరా.. సమ్మె బాటలోనేనీటి సరఫరా కార్మికులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని రామసాగరం గంగవరం గ్రామాల్లోని సత్యసాయి తాగునీటి పంప్ హౌస్ లనుండి గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీరు నీటి సరఫరా కార్మికుల సమ్మె కారణంగా వరుసగా 8వ రోజు మంగళవారం సైతం నీటి సరఫరా ఆగిపోయింది. సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు జిల్లా వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. దీనితో జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలం పరిధిలోని గ్రామాల్లో నీటి కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు తమకు జీతభత్యాలను ఐదు నెలలుగా అందించడం లేదని సమస్యను ఉన్నతాధికారులు త్వరితగతిని పరిష్కరించాలని పేర్కొన్నారు.