ఉరవకొండ: నక్కలపల్లిలో విద్యుత్ షాక్ గురై వ్యక్తి దుర్మరణం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో ఈశ్వర్ రెడ్డి (55)అనే వ్యక్తి ఇంటి వద్ద నీటి కోసం వేసుకున్న మోటార్ పంపు మరమ్మత్తు చేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వన్నూరస్వామి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మోటార్ మరమ్మతు చేస్తే విద్యుత్ షాక్కు గురై అపస్మారకస్థితిలో ఉండటంతో గ్రహించిన కుటుంబ సభ్యులు తొలుత బెలుగుప్ప పిహెచ్సికి తీసుకెళ్లి ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్సలకు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.