కనిగిరి: బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు తో కలిసి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా, సంఘసంస్కర్తగా దేశానికి బాబు జగ్జీవన్ రావ్ చేసిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. జగ్జీవన్ రావ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.