సంతనూతలపాడు: పేర్నమిట్టలో రెండేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సభను నిర్వహించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు మండలంలోని పేర్లమెట్టలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభను సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందన్నారు. అధ్వాన్నంగా ఉన్న రహదారులను బాగు చేయడంతో పాటు, పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. కూటమిపాలనలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.