సంతనూతలపాడు: వైసిపి బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి: సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున
సంతనూతలపాడు మండలంలోని కొన గాని వారి పాలెం లో మాజీ మంత్రి, వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగ నాగార్జున శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి నాగార్జున సమావేశమయ్యారు. వైసీపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వైసీపీ తరఫున నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లు సీరియస్ గా తీసుకొని పనిచేయాలన్నారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపుకు గురి కాకుండా చూసుకోవలసిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ల పై ఉందన్నారు.