కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు లో పూడికతీత పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దరువు ఆధునీకీకరణ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వరుసగా మూడవరోజు బుధవారం కూడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసిబి యంత్రాలు, ట్రాక్టర్లతో దొరువులో చేపట్టిన పూడికతీత పనులను ఎమ్మెల్యే పరిశీలించి ,అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో మంచినీటి దొరువు లో పూడికతీత పనులను చేపట్టి, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.