కనిగిరి: ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి నియోజకవర్గం లో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు. కనిగిరి మండలం పునుగోడు లో ఆర్డబ్ల్యూఎస్ CE హరే రామ్ నాయక్, SE నాగేశ్వరరావు, JE శ్రీకాంత్ లతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తాగునీటి సరఫరా పై ఆదివారం చర్చించారు. కనిగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.