రాప్తాడు: అక్కంపల్లి వద్ద ఈద్గా మైదానాన్ని గురు అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడు అక్కంపల్లి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ఆవేదన
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని అక్కంపల్లి ఈద్గా మైదానంలో గురువారం 11 గంటల 35 నిమిషాల సమయంలో ముస్లిం సోదరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇమామ్ షరీఫ్ పొన్నూరు స్వామి తదితరులు మాట్లాడుతూ అక్కంపల్లి ప్రధాన రహదారి పక్కన 9 సెంట్లు స్థలాన్ని 2014లో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రభుత్వ భూమి ఈదిగా మైదానానికి ఇప్పించడం జరిగిందని అయితే ఆరవ రోడ్డుకు చెందిన గురు అనే వ్యక్తి ఈ స్థలం మాది 82 లక్షలకు కొనుగోలు చేశామని ముస్లింలను బెదిరిస్తున్నాడని ఇలాంటి సంఘటనలు కాకుండా భూ అక్రమాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు.