సంతనూతలపాడు: ప్రతి ఒక్కరూ తమ ఓట్లను మ్యాపింగ్ చేయించుకోవాలి: బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో బిజెపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర కోఆర్డినేటర్ నిడమానూరు నాగేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై స్థానిక ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఇళ్ల వద్దకు వచ్చే బిఎల్వోల చేత ఓటర్లు తమ ఓటును మ్యాపింగ్ చేయించుకోవాలని సూచించారు. ఓట్లు కోల్పోకుండా ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.