కనిగిరి: బైక్ దొంగతనాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: హనుమంతునిపాడు ఎస్సై రాజ్ కుమార్
హనుమంతునిపాడు: బైక్ దొంగతనాలు పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హనుమంతునిపాడు ఎస్సై రాజకుమార్ సూచించారు. ఆదివారం హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ సందర్భంగా వాహనదారులకు బైక్ దొంగతనాల పట్ల ఎస్ఐ రాజకుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బైక్ లో వైర్లెస్ సెన్సార్లతో పనిచేసే ఆంటీ తెఫ్ట్ అలారం అమర్చుకోవాలని సూచించారు .బైక్ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో పార్కు చేయాలన్నారు. వాహనాలకు జిపిఎస్ ట్రాకర్ అమర్చడం వల్ల దొంగతనం జరిగినా బైక్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని సూచించారు.