కనిగిరి: భైరవకోన అభివృద్ధికి చర్యలు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రంలో ఆదివారం హిందూ ధర్మిక పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు హాజరయ్యారు. దాసరి శ్రీనివాసులకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం భైరవకోన క్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భైరవకోన అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులకు వివరించారు. భవిష్యత్తులో భైరవకోనలు చేసే అభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు.