కనిగిరి: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి వినతి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి శాసనసభ్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డిని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవారం కలిశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలయ్యేలా చూడాలని, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేను వారు కోరారు.