ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇన్చార్జి కమిషనర్ శ్రీరామ్ అన్నారు. నగరపాలక సంఘం పరిధిలోని ప్రజలకు సంబంధించిన ఏ పనులు ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అభివృద్ధికి సంబంధించి ఎలాంటి సమస్యలున్న తమకు తెలియజేయాలన్నారు. నగర పంచాయతీలోని ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధి సహకరించాలని కోరారు.